కొత్త రికార్డు క్రియేట్ చేసిన 'రాధేశ్యామ్' మోషన్ పోస్టర్

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ పుట్టినరోజు కానుకగా రాధేశ్యామ్‌ నుంచి ఓ స్పెష‌ల్ ట్రీట్ అభిమనులకి ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. 

గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జిల్‌ ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ దర్శకుడు. ప్రభాస్‌ సరసన బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే సంధర్బంగా రాధే శ్యామ్ మోషన్ పోస్టర్‌ను చిత్రయూనిట్ విడుదల చేశారు. ఈ మోషన్ పోస్టర్‌ రికార్డ్‌ క్రియేట్‌ చేస్తోంది. కేవలం నాలుగు రోజుల్లో‌ 25 మిలియన్‌ ప్లస్‌ వ్యూస్‌ సాధించి. ఇండియన్‌ సినిమాలో అత్యధిక వ్యూస్‌ సాధించిన మోషన్‌ పోస్టర్‌గా రికార్డ్‌ను క్రియేట్‌ చేసినట్లు చిత్రయూనిట్‌ ప్రకటించింది. 

Pocket Cinema News

ప్రస్తుతం ఇటలీలో షూటింగ్ జరుగుతున్నా ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయడానికి చిత్రయూనిట్ ప్లాన్  చేస్తున్నారు. ఈ సినిమా కోసం అటు అభిమానులు, ఇటు  ప్రేక్షకులు మరియు ఇండస్ట్రి వారు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. 


1 కామెంట్‌లు

కొత్తది పాతది