సాయి ధరమ్ తేజ్ నటించిన 'సోలో బతుకే సో బెటరు' సినిమాను ఫస్ట్ కాపీ జీ టీవీ సొంతం చేసుకొన్నది.
సాయి ధరమ్ తేజ్ నటించిన మరో సినిమాను నిర్మాణంలో వుండగానే జీ టీవీ కొన్నది. అంతేకాదండోయ్ నిర్మాణానికి జీ టీవీ ఫండింగ్ ఇస్తుందట. టాలీవుడ్ లో ఓటిటిల దూకుడు చాలా స్పీడ్ మీద వుంది. పోటీలు పడి సినిమాలు కొంటున్నారు.
భగవాన్ పుల్లారావు నిర్మాణంలో ధరమ్ తేజ్-దేవా కట్టా కాంబినేషన్ లో రెడీ అవుతున్న సినిమాను జీటీవీ 35 కోట్లకు కొనేసింది. విడతలు విడతలుగా అమౌంట్ విడుదల చేస్తుందట. సినిమాను తక్కువ బడ్జెట్ లో కంప్లీట్ చేసుకోగలిగితే మంచి లాభం ఉంటుంది. ఓటిటిల దూకుడు చూస్తుంటే నిర్మాతలకు థియేటర్లపై దూకుడు తగ్గేలా ఉంది.
Tags:
Cinema News
