తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన రాజకీయ ప్రవేశంపై కీలక ప్రకటన చేశారు. అభిమాను ఎన్నో ఏళ్లుగా ఊరిస్తూ వస్తున్న ఆయన. ఎట్టకేలకు కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను ప్రజల సహకారంతో గెలుస్తామని, నిజాయితీ, పారదర్శక, అవినీతి రహిత, జాతి మత ద్వేషాలు లేని రాజకీయం తమిళనాడులో తప్పనిసరిగా ఉద్భవిస్తుందని రజినీకాంత్ తన ట్విట్టర్లో పోస్ట్ చేసినారు. జనవరిలో పార్టీ ప్రారంభించనున్నట్లు. డిసెంబర్ 31న పార్టీ ప్రకటన ఉంటుందని రజినీకాంత్ ట్వీట్ చేశారు.
పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తానని తెలిపారు. రజనీ ట్వీట్తో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
Tags:
Politics

